*ప్రెస్ నోట్*
*ఏపీ పి. టి. డి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా, విశాఖ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో రీజనల్ మేనేజర్ వారి ఆఫీస్ (గాంధీ విగ్రహం )వద్ద జరుగుతున్న నిరవధిక “రిలే నిరాహార దీక్షా” కార్యక్రమం నేటికి 20 రోజులు దాటిన విషయం విదితమే.సమస్యల పరిష్కారానికి విశాఖ డి.పి.టి.వో స్పందించని కారణంగా నేడు గాంధీ విగ్రహం వద్ద అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు నిరాహార దీక్ష శిబిరాన్ని అర్థ నగ్న ప్రదర్శనను ఉద్దేశించి రాష్ట్ర కోశాదికారి పి.వి.వి. మోహన్ మాట్లాడుతూ ఉద్యమ అవశ్యకతను తెలిపారు గాంధేయ మార్గంలో కార్మికులు చేస్తున్న ఉద్యమం ఊరకేపోదని న్యాయమైన డిమాండ్స్ తో కడుపులు మార్చుకొని నిరహార దీక్ష చేస్తుంటే విశాఖ డి.పి.టి.వో కనీసం సమస్యల పరిష్కారంనకు కనీసం చొరవ చూపటం లేదని అన్నారు. క్రమశిక్షణ పేరుతో విశాఖ డి.పి.టి.వో దాదాపు ఎనిమిది నెలల నుండి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు పిల్లలతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురవు తున్నారని అన్నారు. 2019 సర్క్యులర్ వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఇంక్రి మెంట్లు కలవకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు వెహికల్ కండిషన్ గురించి పట్టించుకోవడం లేదన్నారు దాదాపు 100 కి పైగా రద్దు చేసిన షెడ్యూల్స్ వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. అక్రమంగా అవక తవకలతో వేసిన వాల్తేర్ గాజువాక చార్టులు రద్దు చేయాలని అన్నారు. మహిళా సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమయ్యిందని అన్నారు సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగుతాయని ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని అన్నారు. ఈ నిరాహార దీక్షా శిబిరం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి.రామా రావు జోనల్ కార్యదర్శి యం.వి.ఆర్.మూర్తి రీజనల్ అద్యక్ష కార్యదర్శులు గండి రామకృష్ణ బి.నీలకంఠం డివిజన్ కార్యదర్శి ఎ.కె.శివాజీ డివిజన్ అద్యక్షులు వి. యస్.అర్.మూర్తి గాజువాక కార్యదర్శి పి. శంకరరావు వాల్తేర్ కార్యదర్శి అర్. వసంతరావు మద్దిలపాలెం అధ్యక్ష కార్యదర్శులు చిన్నా ఈశ్వర రావు సింహాచలం అద్యక్షులు డి.ఎ.నాయుడు*
*జోనల్ రీజనల్ డివిజనల్ డిపో గ్యారేజి నాయకులు అధిక* *సంఖ్యలో మహిళలు కార్మికులు*
DPTO విశాఖపట్నం వారు అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి
22