జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించండి – వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం వినతి

by capitalmedianews.com

జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కల్పించండి || వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం వినతి

విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంద్ర ప్రసాద్‌కు ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్‌, ఏపీ స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియున్ల విశాఖ యూనిట్‌ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ను కలిసి స్కూల్‌ ఫీజు రాయితీ విషయమై వినతి పత్రం సమర్పించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్‌ అధ్యక్షులు పి.నారాయణ్‌లు ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. తాజాగా తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడ జర్నలిస్టుల ఫిల్లలకు ఫీజు రాయితీ కల్పించిన విషయాన్ని వివరిస్తూ, అందుకు సంబంధిచిన ఉత్తర్వులను అందజేశారు.2016 నుంచి విశాఖ ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించిన ఉత్తర్వులను కూడా కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖ జిల్లాలో కూడా జర్నలిస్టుల ఫిల్లలకు స్కూల్‌ పీజు రాయితీ కల్పించే విషయమై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణ్‌లు మాట్లాడుతూ స్కూల్‌ ఫీజుతో పాటు, ఇంటర్‌కు సంబంధించి కూడా గతంలో కొన్ని కళాశాలలు జర్నలిస్టులకు రాయితీ ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఆ దిశగా కూడా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మధన్‌, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శలు జగన్మోహన్ , కె శ్రీనివాసరావు. జిల్లా నాయకులు పితాని ప్రసాద్‌, శివప్రసాద్‌ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles