రాష్ట్ర ముఖ్యమంత్రి టీచర్ పోస్టులు 23000 ఖాళీ ఉంటే 6100 నోటిఫికేషన్ ఇవ్వడం ఆశ్చర్యమని NUSI అన్నారు

by capitalmedianews.com

25వేల ఖాళీలుంటే 6,100 టీచర్ పోస్టుల భర్తీకు డీఎస్సీ నిర్వహించనుండటం దారుణం

NSUI జిల్లా నాయకులు మంజునాథ్

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను మభ్య పెట్టడానికి కేవలం 6,100 టీచర్ పోస్టుల భర్తీకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించడం దారుణమని NSUI జిల్లా నాయకులు మంజునాథ్ వాపోయారు. ఈ సందర్భంగా సొమవారం రాప్తాడు మండలంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని అన్నారు. అబద్దాలు, మోసం, వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్.. ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయి, మెగా డీఎస్సీ ఇస్తా అన్నారని గుర్తు చేశారు.గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని.. ఇప్పుడు చివరకు ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లే ముందు 6 వేల పోస్టులు భర్తీ చేస్తానంటున్నాడని అన్నారు. ‘‘2021 – 22 నాటికి ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. 12,386 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఖాళీలు ఉన్నాయి కానీ 8,366 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి బొత్స అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇప్పుడు అందులో కూడా 2,366 పోస్టులు కోతపెట్టి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటున్నారు. మూడు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ పరీక్ష ఇంకెప్పుడు నిర్వహిస్తారని అన్నారు.ముఖ్యమంత్రి జగన్, విద్యామంత్రి బొత్స మాత్రం పూటకోమాట చెబుతూ చివరకు నిరుద్యోగులను నిండా ముంచేశారు అని అన్నారు. అదే విధంగా కేవలం ఎన్నికల కోసమే జగన్ ఇప్పుడు నోటిఫికేషన్‌ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అని అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles