ఫిషింగ్ హార్బర్ లో ఘనంగా గంగమ్మకు సహస్ర కళాశాభిషేకం రాష్ట్ర మరపడవ ల అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్

by capitalmedianews.com

[2/4, 9:22 AM] Jhanik Ram, V: *మీడియా వారికి ఆహ్వానం*

గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం సంఘటన వలన మత్స్య పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపింది. అందువలన శ్రీశ్రీశ్రీ గంగాదేవి వారి ఆశీస్సులు కోసం ఈరోజు నుంచి ఎటువంటి పెను ప్రమాదాలు జరగకుండా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ను విశాఖ నగరాన్ని కాపాడాలని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి *శాంతి హోమం* గా *”శ్రీ జటా రుద్ర రాజశ్యామల జటా గంగేశ్వర మహా యజ్ఞం”* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 6/2/2024 మంగళవారం నాడు సాయంత్రం 3 గంటల నుంచి మత్స్యకార మహిళలు కలశాలతో అమ్మవారి దేవాలయం నుంచి బయలుదేరి ప్రమాదం జరిగిన ఘటన స్థలం వద్దకు చేరుకొని అక్కడ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి అమ్మవారికి కలసాభిషేకం మహిళలు మత్స్యకారులు చేస్తారు. హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటనను దేశ వ్యాప్త సంచలన వార్తగా తెలియజేసి మాకు ఎంతో సహకరించిన మళ్లీ మత్స్య పరిశ్రమ పునర్జీవం పోసుకొని వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా సాగడానికి కృషి చేసిన మీడియా సహోదరులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ… ఈ మహా యజ్ఞం శాంతి హోమం లో పాల్గొనటానికి…. మీడియా కవరేజ్ చేయటానికి రావలసిందిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.

రేపు అనగా 4-2 -2024 ఆదివారం నుంచి 6 -2 -2024 మంగళవారం వరకు ఈ మహా యజ్ఞ కృతువు జరుగును. సమయం: ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు.

మీ
*వాసుపల్లి జానకిరామ్*
ప్రెసిడెంట్
ఆంధ్ర ప్రదేశ్ మెకానేజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్
[2/5, 7:16 PM] Jhanik Ram, V: ప్రెస్ నోట్

ఫిషింగ్ హార్బర్ లో ఘనంగా గంగమ్మకు సహస్ర కళాశాభిషేకం
రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో శ్రీ జటా గంగేశ్వర రాజ్యశ్యామల అమ్మవారి యజ్ఞం దేదీప్యమానంగా జరిగింది. ఈ మహా యజ్ఞంలో భాగంగా ఈరోజు శాంతి హోమాలతో పాటు పరమశివునికి గంగమ్మ తల్లికి సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. మత్స్య పరిశ్రమ ప్రముఖులు అందరూ గంగేశ్వరునికి సహస్ర కలశాభిషేకం పాల్గొన్నారు . రేపు అమ్మవారికి శ్రీ చక్ర మహా యజ్ఞం నిర్వహించి అనంతరం ఊరేగింపుతో హార్బర్ వేలం కేంద్ర వద్ద గంగా హారతి గంగమ్మకు, రుద్ర రాజేశ్వరునికి, రాజ్య శ్యామల దేవి కి సహస్ర కళాశాభిషేకం జరిగిన తర్వాత ఈ మహా యజ్ఞం పూర్తవుతుందని రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలియజేశారు. రేపు గంగమ్మ తల్లి కి శాంతి హోమం ముగింపు సందర్భంగా రేపు ఫిషింగ్ హార్బర్ లో స్వచ్ఛందంగా సెలవు ప్రకటించడం జరుగుతుందని కావున రేపు ఫిషింగ్ హార్బర్ లో ఎటువంటి కార్యకలాపాలు జరగవని ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరామ్ మీడియా కు తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles