తేది.03/02/2024.
ఏటూరు నాగారం మండలం.
ములుగు జిల్లా .
మల్యల సమ్మక్క, కొండాయి గోవిందరాజుల, నాగులమ్మ దేవాలయాలను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.
*****
మాల్యల సమ్మక్క, కొండాయి గ్రామం లోని గోవిందరాజుల , నాగులమ్మ దేవాలయాలను శనివారం రాష్ట్ర పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు.
ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ మేడారం మహా జాతర కు అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అని కోటి మందికి పైగా భక్తులు వచ్చే జన జాతర కు ప్రభుత్వం 105 కోట్ల రూపాయిలు కేటాయించి సలక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. మేడారం జాతరకు వచ్చే రహదారుల పనుల దాదాపు పూర్తి అయ్యాయని, కొండాయి నుంచి ఊరాట్టం వచ్చే రహదారి విషయం అటవీ అధికారుల అనుమతి కొరకు మంత్రి కొండా సురేఖ తో చర్చించి తొందరలోనే అటవీ ఉన్నత అధికారులతో మాట్లాడి రహదారి పూర్తి చేస్తామని అన్నారు.
జాతర పనుల విషయం లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నాణ్యత లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వాలిటీ కంట్రోల్ చేసిన తరువాతే బిల్లుల చెల్లింపు జరుగుతుందని తెలిపారు.
వరదల సమయంలో కోండాయి మల్యాల దొడ్ల గ్రామాలు ముంపుకు గురి అయ్యాయి ఇక్కడి గ్రామాలను జాతర అనంతరం వరద ముంపు ప్రాంతాలను వేరే ప్రాంతాలకు తరలించడామా, గ్రామ చుట్టూ వరద రాకుండా కరకట్ట నిర్మించాలా విషయం పై ఇంజనీరింగ్ అధికారులతో పూర్తి నివేదిక తెప్పించి , ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు.
అంతకుముందు దొడ్ల బిడ్జిని మంత్రి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐ టి డి ఎ పి ఓ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు )పి శ్రీజ, ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిషెట్టి సంకీర్త్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.