ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీ నే గేలిపిస్తాం
– మక్కా మసీదు అధ్యక్షుడు షేక్ మున్నీర్
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ):
విశాఖపట్నం లో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీదు అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు. నగరంలో గల పది మసీదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు డాబా గార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్, లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. షేక్ మున్నీర్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర లో 34 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. 1994 లో ఎస్.ఏ. రెహమాన్ ను గెలిపించాము అన్నారు. విశాఖలో 1972 లో కూడా ముస్లిం నేత గెలిచారు అని గుర్తు చేశారు. జిల్లా జనాభాలో
రెండో స్థానంలో వున్నా సరే చట్ట సభల్లో సరైన
ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు.
ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్ట సభల్లో ప్రాతినిధ్యం కావాలి అని కోరారు.
విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. జిల్లాలో
మూడు లక్షల 50 వేల ముస్లిం జనాభా వుంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు
టికెట్ ఇచ్చే పార్టీ నీ గెలిపిస్తాం అని పేర్కొన్నారు. ముస్లిం నేత బాబు మాట్లాడుతూ,
దక్షిణ, ఉత్తర నియోజక వర్గంల లో ముస్లిం నేతలకు టికెట్స్ ఇవ్వాలి అని కోరారు.
దక్షిణ నియోజక వర్గంలో 25 వేల ముస్లిం ఓటర్లు వున్నారు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే, ముస్లిం నేతలను
ఇండిపెండెంట్ గా రంగంలో దించే ఆలోచన వుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అన్ని రాజకీయ పార్టీలు ముస్లిం లకు అన్యాయం చేస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలో 120 మసీదులు వున్నాయి అని గుర్తు చేశారు. రాష్ట్రంలోవిజయ వాడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఐదు స్థానాలు గెలిచే సత్తా వుంది అని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ముస్లిం నాయకులు సనా వుల్లా, జమీల్ అహ్మద్, అబ్దుల్ రహీమ్, అబ్దుల్ అజీజ్, అహ్మద్ తుల్లా, రవూఫ్, జియ ఉల్ హన్, రహమాన్, పలు మసీదుల ప్రతినిధులు పాల్గొన్నారు.