విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుతాం సహకరించండి.
– ఎకో వైజాగ్ ను జయప్రదం చేయండి
– సోమవారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– జియ్యాని శ్రీధర్, డిప్యూటీ మేయర్, జీవీఎంసీ
విశాఖను హరిత వనంగా తీర్చిదిద్దుతాం సహకరించండి అని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పిలుపునిచ్చారు
ఆదివారం ఉదయం రెండవ రోజు మురళి నగర్ లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో మురళి నగర్ గార్డినర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినియేచర్ ఎగ్జిబిషన్, ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేస్తున్న వారందరినీ అభినందించారు. మురళి నగర్ లోని గార్డెనర్స్ నిర్దిష్టమైన విధానంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రధానంగా
పంజాబ్ నేషనల్ బ్యాంక్, విశ్రాంత మేనేజర్ ఉదయ భాస్కర్ ఆర్ట్స్, జి రమాదేవి ప్రొఫెషనల్ మినియేచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయన్నారు. అలాగే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న హాలు పై భాగంలో సరిత చిన్న స్థలం లో అత్యధికంగా పెంచుతున్న కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. విశాఖ నగరం అంతా ఇళ్ల వద్ద వ్యవసాయం చేసుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తాం అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న అభినందనీయం అన్నారు. 5 వ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి చూడాలని కోరారు. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు, జీవిఎంసి సిబ్బంది, అధికారులు వీక్షించాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ , మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తాను ఎకో వైజాగ్ కోసం నిరంతర కృషి చేస్తున్నామన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పర్యావరణ విభాగం ప్రొఫెసర్ హేమ శైలజ మాట్లాడుతూ విరివిగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. తాను సైతం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. వివిధ సంస్థల్లో సైతం ఇళ్ల వద్ద పంటలు పండించుకోవడం, పర్యావరణానికి మేలు చేసే, పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి ఉపకరించే, జీవరాశికి ఆహారానందించే, ఔషధ జాతి మొక్కలు పెంచడానికి కృషి చేస్తున్నాను అన్నారు.
రైతు సాధికారత సంస్థ జిల్లా అధికారి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో, నగరంలో ఇళ్ల వద్ద పంటలు పండించుకునేవారు, పంట చేలల్లో పంటలు పండించుకునే రైతులకు తాము సహకరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అరుణ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. మురళి నగర్ గార్డినర్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు.