ప్రెస్ నోట్
—————
అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పివియన్ మాధవ్
ఈ రోజు శనివారం ఉదయం 11:00 గంటలకు జీవీఎంసీ ఎదురుగ ఉన్న గాంధీ విగ్రహం వద్ద విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కావలసిన స్థలాన్ని అప్పగించని ఏపి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీయల్ నరసింహరావు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.అలాగే ఏపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వణి వైష్ణవ్ పార్లమెంట్ విభాగంలో రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించక పోవడమే అని స్పష్టం చేసారన్నారు.కనుక రాష్ట్రప్రభుత్వం నకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధీశ్వరీ సూచన మేరకు శాంతియుతంగా దర్నా చేస్తుంటే బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఏపీ భాజాపా తీవ్రంగా ఖండిస్తుందని మాధవ్ అన్నారు.ఇలాంటి ఉడత చప్పులకు భాజాపా బెదిరేది లేదని సురేంద్ర మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి,రాష్ట్ర నాయకులు సుహాసినీ ఆనంద్ ,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిలీప్ నాయుడు,వంశీ,నాగరాజు,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
– బీజేపీ మీడియా