దళిత సింహ గర్జన ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్తున్నారు

by capitalmedianews.com

11న దళిత సింహా గర్జన

– కాంగ్రెస్ మాజీ ఎం.పి.హర్ష కుమార్

డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ):

రాజమండ్రి వేమగిరిలో
ఈ నెల 11న జరగనున్న సింహగర్జన భారీ బహిరంగ సభ విజయ వంతం చేయాలని కాంగ్రెస్ మాజీ ఎం.పి. జీ వీ హర్ష కుమార్ కోరారు. డాబాగార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల పథకాలు రద్దు పట్ల దళిత జాతి ఆగ్రహంగా వుంది. తమ మనోభావాలు వెల్లడి గాను ఈనెల 11న రాజమండ్రి లో దళిత సింహా గర్జన తల పెట్టాము. రాష్ట్రంలో దళితులు రెండో స్థాయి పౌరులుగా వుంటున్నారు. రాష్ట్రంలో
23 దళిత పథకాలు రద్దు చేశారు.
విద్యకు పెద్ద పీట
ఇంగ్లీష్ మీడియం అమలు అని గొప్పలు చెబుతున్నారు. అమ్మ వొడి కి తూట్లు పొడిచి, ఇంటికి ఒక్కరికే అమ్మ ఒడి ఇవ్వడం అన్యాయం.
నవరత్నాలు కి రాష్ట్ర బడ్జెట్ నిధులు మంజూరు చేస్తారు. కానీ, అమ్మ ఒడికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నారు
గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు అమలు చేసిన ఉపకార వేతనాలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కోతలు పెట్టారు. ఇప్పుడు ప్రైవేట్ పి జీ విద్యార్థులకు ఫీజులు ఇవ్వడం లేదు. ఐదు మెడికల్ కాలేజీ లలో 150 సీట్లు వంతున వుంటే రిజర్వేషన్ లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు.
దళితులను మోసం చేసిన జగన్ ఎన్నికల్లో ఓటమి ఖాయం అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు.
ఎన్ ఎఫ్ డి సీ ద్వారా కార్ల రుణాలు, భూమి కొనుగోలు, విదేశీ విద్య అమలు చేయడం లేదు. రాష్ట్రంలో అట్రా సిటీ కేసులు పెరిగిపోయాయి.
డాక్టర్ సుధాకర్ మానసిక హత్య, కిరణ్ కుమార్ లాకప్ డెత్ శిరోముండనం ఘటనలు ప్రజలు మర్చి పోరు అని అన్నారు.
రాష్ట్రంలో వై వీ సుబ్బా, విజయ సాయి రెడ్డి, సజ్జల రామ కృష్ణా రెడ్డి, పెత్తందారులు అన్నారు.
మంత్రులకు అధికారం లేదు అని ఎద్దేవా చేశారు. ఎస్సీ
సబ్ ప్లాన్ నిధులు తో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో
దళితులు జగన్ తో లేరు అని ఆయన స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో మాల మహానాడు , దళిత సేన రాష్ట్ర అద్యక్షుడు పాల్తేటి పెంటా రావు ప్రొఫెసర్ జాన్, సత్యవాణి, వసంత అప్పారావు, ఎస్. అంతోనీ, పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles