ప్రజా చైతన్యానికే శంఖారావం అని టిడిపి దక్షిణ ఇన్చార్జ్ గండి బాబ్జీ అన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సిఎమ్ జగన్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వస్తున్నారు అని అన్నారు శంఖారావం నాదమే జగన్ పాలనకు చరమగీతం యువగళం పేరుతో సుమారు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు సుమారు 120 నియోజకవర్గాల వరకు పూర్తి చేశారు ఆ యాత్ర పూర్తి కానటువంటి సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాలను శంఖారావంలో పూర్తిచేస్తారు
రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి మొదలయ్యే శంఖారావం రోజుకి మూడు నియోజకవర్గాలు చొప్పున జరుగుతుంది శంఖారావం యాత్ర 18 తారీన విశాఖతో ముగుస్తుంది అని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతూ యువనేత లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం ప్రజలొ చైతన్యం తీసుకు వస్తుంది అని అశాభావం వ్యక్తం చేశారు యువగళం పేరుతో చేసిన పాదయాత్రలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు లోకేష్ చేస్తున్న పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు
కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ