రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఎమ్మార్వో హత్య వెనుక వైసిపి వ్యక్తులు వున్నారని చెపుతున్నారు
రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీలు చేస్తున్నారు లేదంటే చంపేస్తున్నారు
ఉత్తరాంధ్ర లో శాంతి ని హరిస్తున్నారని అన్నారు
దోపిడీలు, హత్యలు , దౌర్జన్యాలు జరుగుతున్నాయి
అంటే జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి అన్నారు
అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్ష సాధించుకుంటున్నారు
సంతనూతలపాడులో ఎమ్మార్వో పై గతంలో చెంచు రెడ్డి దాడి చేశాడు
ధర్మవరం ఎమ్మెల్యే దళిత కలెక్టర్ పై దౌర్జన్యానికి దిగిన సంఘటన చూశాము గుడివాడలో భూకబ్జాలను ఆపే ప్రయత్నం చేసిన విఆర్వో పై నాని మనుషులు దాడికి తెగబడ్డారు అని చెప్పారు
కొమ్మాది లో జరిగిన హత్య తో జనం వణికిపోతున్నారు అని అన్నారు తెలుగు దేశం పార్టీ దక్షిణ ఇన్చార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎప్పటికి మెరుగుపడతాయి
నేర ప్రవృత్తి పెరగడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే
భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి అభివృద్ది లేకపోగా వినాశనం దిశగా రాష్ట్రం పయనిస్తోంది అని అన్నారు భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజుబాబు మాట్లాడుతూ హత్యా సంస్కృతిని విశాఖ తీసుకువచ్చారు అని అన్నారు
భీమిలిలో ల్యాండ్ పూలింగ్ వల్ల లాభపడింది జగన్ మనుషులే ఎమ్మార్వో హత్యపై
సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేశారు టిడిపి రాష్ట్ర ప్రధా కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసం పాలన సాగించే ప్రభుత్వం కాదు ఇది
ముడసర్లోవ ప్రాంతాన్ని కన్సర్వేషన్ జోన్ ను రిక్రియేషన్ జోన్ గా మార్చేశారు రైల్వే జోన్ ఏర్పాటుకు భూమిని బదలాయించకుండా ఆపుతున్నారు అని అన్నారు ప్రధాన కార్యదర్శి బాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి మూలకారకుడు జగన్ రెడ్డి మేనమామ డి రవీంద్రారెడ్డి అని అన్నారు అతను విశాఖపట్నంలో తిష్ట వేసుకొని కూర్చుని పార్టీలకు అతీతంగా సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపించారు వారు చేస్తున్న పాపాలకు రెండు నెలలలో ప్రజలు చర్మ గీతం పాడుతారని అన్నారు
కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ