జన జాగృతి సమితి వేలెంటెన్స్ డే ను బహిష్కరిస్తూ జాగ్రత్తలు చెప్పారు

by capitalmedianews.com

ప్రెస్ నోట్
వాలంటేన్ డేను బహిష్కరించండి
విద్యార్థి,యువతకు జన జాగరణ సమితి పిలుపు
ఫిబ్రవరి 14న వాలంటేన్ డేను బహిష్కరించాలని కోరుతూ ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు వీధిలో ఉన్న NRI జూనియర్ కాలేజీ విద్యార్థులకు జన జాగరణ సమితి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ జన జాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకం కాదు అని, ప్రేమికుల రోజు పేరుతో జరిగే విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, అమ్మాయిలపై జరిగే హింసకు, మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకం అని అన్నారు. రోమ్ దేశానికి చెందిన దేశద్రోహి సెయింట్ వాలంటేన్ ను ఉరి తీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదు అన్నారు. భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రేమికుల రోజు అనే విదేశీ విష సంస్కృతిని ఎరగా వేసి విద్యార్థి,యువతపై బలవంతంగా రుద్దుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.వాలంటేన్ డేను అధికారికంగా నిషేధించిన మన శత్రుదేశమైన కూడా ఈ విషయంలో పాకిస్తాన్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి పనికిమాలిన దినోత్సవాలు కారణంగా మన దేశంలో పవిత్రమైన వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతుంది దాని కారణంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో కీలకమైన విద్యార్థి,యువత స్వచ్ఛందంగా ప్రేమికుల రోజును బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, సామాజిక కార్యకర్త శ్రీహరి కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
సదా భరతమాత సేవలో….
వాసు
జన జాగరణ సమితి
రాష్ట్ర కన్వీనర్

Use Social Media to Spread the Word about Our News

related articles